పోరాటాల ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రామానాయుడు స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిపిఐ పార్టీ సభ్యుల రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ, కార్మిక, కష్టజీవుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఆవశ్యమని అన్నారు. పి. మహేంద్ర ఈ శిక్షణా తరగతులకు అధ్యక్షత వహించారు.