నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రమాకాంత్ శెట్టి శనివారం, తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ఎం. రవిచంద్రకు రూ. 20 లక్షల విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ విరాళం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు అందించబడింది.