తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించిన తర్వాత, సాయంత్రం స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి, పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు.