తిరుపతి నగరపాలక సంస్థలో జూలై 15న సోమవారం ఉదయం 10 నుంచి 2గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ఉదయం 10. 30 నుంచి 11. 30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలు జరుగనున్నట్లు కమిషనర్ ఎన్. మౌర్య ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు 0877-2227208 నంబర్కు కాల్ చేయొచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఆమె కోరారు.