అమెరికాలో ఇటీవల జరిగిన ప్రపంచ పోలీసు క్రీడల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించిన టీటీడీ వీజీవోలు సురేంద్ర, రామ్ కుమార్ లు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ. ఆర్. నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి తమ పతకాలను చూపారు. టీటీడీ ప్రతిష్ట మరింత పెంచేలా విజయం సాధించిన ఇరువురు భధ్రతాధికారులను టీటీడీ చైర్మన్ అభినందించారు.