వెంకటగిరిలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయం నుంచి శనివారం సత్య సాయి బాబా ప్రేమ ప్రవాహిని రథయాత్ర పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథయాత్రను వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయి కృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పుట్టపర్తిలో వెలసిన సత్య సాయిబాబాకు తమ కుటుంబానికి పూజా పరంగా సంబంధాలు ఉన్నాయన్నారు.