AP: నాలుగు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకుని.. సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టటుకు చేరుకున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, CS, DGP తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రోడ్డు మార్గంలో ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సింగపూర్ లో పర్యటించిన విషయం తెలిసిందే.