విశాఖలో లులు గ్రూప్నకు భూములు కేటాయింపు అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రూ.1500 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్లకు అప్పగించడం లాలూచీ చర్య అని ఆరోపించారు. కానీ అందులో సగం పెట్టుబడి కూడా రాదని అన్నారు. టీసీఎస్కి కూడా అప్పనంగా స్థలాన్ని ఇచ్చారని బొత్స విమర్శించారు. ‘‘డేటా సెంటర్ మేం పెట్టలేదా? విశాఖలో ఐటీ అభివృద్ధికి బీజం వేసింది వైఎస్సార్’’ అని చెప్పారు.