AP: సీఎం చంద్రబాబు రేపు వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండల గూడెంచెరువులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో మాట్లాడుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి గండికోటకు చేరుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టనున్న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) స్కీమ్ కింద దీనికి రూ.78 కోట్లు కేటాయించారు.