AP: సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదు రోజుల జిల్లాల పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న ఆయన సోమవారం ఈ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక, పంచాయితీరాజ్, హోం శాఖల సేవలపై సీఎస్, డీజీపీలతో కలిసి ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షలో వివిధ శాఖల పనితీరుపై చర్చ జరిగినట్లు సమాచారం.