AP: ఆక్వా, పొగాకు రంగాలపై, ఎల్నినో ప్రభావంపై సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించారు. నాన్-ఆక్వా జోన్కు రాయితీ విద్యుత్ అందిస్తామని, ఈ నెల నుంచే యూనిట్ విద్యుత్ రూ.1.50కే లభిస్తుందని తెలిపారు. ఆఫ్-స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు ధర ప్రకటించారు. ఎల్నినో సంక్షోభ నివారణకు ఈ నెల 7 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు వెల్లడించారు.