నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి… రెండు నిమిషాల దూరంలోని ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఆయన రాజధాని పర్యటన ప్రారంభమవుతుంది. ఆయన పర్యటన అంతా రోడ్డు మార్గంలోనే జరగనుంది. 2015 అక్టోబర్ 11న ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్