AP: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. జాయింట్ కప్లింగ్ ఊడి రెండు బోగీలు రైలు నుంచి విడిపోయాయి. దాంతో అప్రమత్తమైన లోకోపైలట్ ఆ రైలును నిలిపివేశారు. లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.