AP: పట్టణాల అభివృద్ధికి కమిషనర్లు కష్టపడి పని చేయాలని మంత్రి నారాయణ సూచించారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ల సంఘం డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భవనాలు, లేఅవుట్ల అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగించామన్నారు. ప్రజలకు పారదర్శకంగా సేవలందించేలా అధికారులు పని చేయాలన్నారు.