జగన్‌‍ను కలిసిన గురజాల వైసీపీ నేతలు

AP: టీడీపీ నేతలు తమపై హత్యాయత్నం చేసారని గురజాల నియోజకవర్గ వైసీపీ నేతలు తాడేపల్లిలో జగన్‍కు ఫిర్యాదు చేసారు. చర్లగుడిపాడులో బీసీ వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు పార్టీ కార్యకర్తలను టీడీపీ గూండాలు హత్య చేశారని, తమ వారి హత్యలతో తామంతా రోడ్డున పడ్డామని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను జగన్ ఓదార్చి, న్యాయపరమైన సహాయం అందిస్తామని, కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్