AP: రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై వైఎస్ జగన్ అప్రమత్తతతో ఉండాలని పిలుపునిచ్చారు. పక్కా వ్యూహంతో ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఓట్లు తగ్గడం వల్ల అక్కడి అధికార పార్టీలు ఓడిపోయాయని, గత ఎన్నికల్లో ఓట్లు భారీగా పెరగడం వల్ల వైసీపీ ఓడిపోయిందని జగన్ విశ్లేషించారు.