నేడు కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

కానిస్టేబుల్ తుది ఫ‌లితాల‌ను ఇవాళ (శుక్ర‌వారం) హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుద‌ల చేయ‌నున్నారు. జూన్ 1న జ‌రిగిన తుది ప‌రీక్ష‌కు మొత్తం 37,600 మంది హాజర‌వ్వ‌గా.. వీరిలో 33,921 మంది అర్హత సాధించారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఫైన‌ల్ మెరిట్ లిస్ట్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. 2022లో 6,100 ఖాళీల‌తో కానిస్టేబుల్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా.. కోర్టులో ప‌లు కేసులు న‌మోద‌వ్వ‌డంతో ప్ర‌క్రియ ఆల‌స్య‌మైంది.

సంబంధిత పోస్ట్