న్యాయస్థానాలంటే జగన్‌కు లెక్కలేదు: సీఎం చంద్రబాబు

AP: న్యాయస్థానాలంటే జగన్‌కు లెక్కలేదని, అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పరకామణి చోరీని సాధారణ కేసుగా చూడటాన్ని హైకోర్టు తప్పుపట్టిందని, భక్తుల సొమ్ము చోరీ సెంటిమెంట్‌తో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని, అయితే పీపీపీ విధానంపై ఆమె గట్టిగా చెప్పడంతో వారు వెనుదిరిగారని తెలిపారు

సంబంధిత పోస్ట్