ఇలాంటి చర్యలే పైరసీకి దారి తీస్తాయి: సీపీఐ నారాయణ

డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం పెంచడంపై సీపీఐ నాయకుడు నారాయణ తీవ్రంగా స్పందించారు. ప్రీమియర్లకు రూ. 600, థియేటర్లలో అదనంగా రూ 75–₹100 పెంపు ప్రజలపై భారం మోపుతుందని, ఇలాంటి చర్యలే పైరసీకి దారితీస్తాయని ఆయన విమర్శించారు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజల జేబులకు తూటాలు పొడవడం సరికాదన్నారు. పైరసీని అరికట్టే నైతిక హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు లేదని నారాయణ అన్నారు.

సంబంధిత పోస్ట్