టీడీపీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా జగన్ బంగారుపాళ్యం పర్యటన వెనుక క్రిమినల్ కుట్ర దాగి ఉందని ఆరోపించింది. వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డి మామిడి తోట నుంచి 5 ట్రాక్టర్ల కాయలను తెప్పించి, జగన్ వచ్చేసరికి వాటిని రోడ్డుపై పారబోయించారని పేర్కొంది. ఈ సంఘటన ముందస్తు ప్లాన్లో భాగమని, సీఎంగా పనిచేసి మామిడిపంటపై వాహనాలు పోనివ్వడం సమంజసం కాదంటూ అచ్చెన్న ప్రశ్నించిన వీడియోను షేర్ చేసింది.