వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లకల్లోలం నెలకొంది. గాలివానకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ టెంట్లు, షామియానాలు కుప్పకూలాయి. దీంతో పోలింగ్ సిబ్బందిని బస్సుల్లో మరో చోటుకు అధికారులు తరలించారు.