AP: తమిళనాడు–ఏపీపై దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం తుఫాను బలహీనపడినా, రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు. అయితే తుఫాను తీవ్రత తగ్గడంతో నేడు (మంగళవారం) స్కూళ్ల సెలవుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి, ఈ రోజు విద్యాసంస్థలు యథావిధిగానే నడవనున్నాయి.