AP: వైసీపీ కీలక నియామకాలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దాసరి వీరయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పుత్తా శివశంకర్ రెడ్డి, యనమల నాగార్జున యాదవ్ను నియమించింది.