AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు స్వయంగా తన చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఈ నెల 16న 6 వేల మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 వేల మంది కానిస్టేబుళ్లను భర్తీ చేసింది. నియామక పత్రాలు అందజేసేందుకు తాజాగా కసరత్తులు ప్రారంభించింది.