AP: భీమవరంలో డీఎస్పీ జయసూర్యపై పేకాటను ప్రోత్సహిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై డీజీపీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు తాజాగా స్పందించారు. "నాకు ఉన్న సమాచారం మేరకు భీమవరం DSP జయసూర్య మంచి ఆఫీసర్. ఆయన గురించి పవన్కు ఎవరు ఏమి చెప్పారో నాకు తెలియదు" అని మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలతో పవన్కు షాక్ తగిలినట్లేనని చర్చ సాగుతోంది.