AP: సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఏపీ బీజేపీ చీఫ్ జి. మాధవ్ కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కల్తీ నెయ్యి సమస్య, తాజా రాజకీయ పరిణామాలు, శాంతిభద్రతలపై చర్చించనున్నారు. అనంతరం ప్రెస్ మీట్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారంపై సీఎం, డిప్యూటీ సీఎం, ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడే అవకాశం ఉంది.