అడవుల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లే ప్రణాళికను, ఎకో టూరిజం ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించే యోచనను తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్రంలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.