ఏపీలో డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 421 డీజిల్ బంకులు మూతపడటంతో, స్టాక్ ఉన్న బంకుల వద్ద భారీగా వాహనాల క్యూలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా వరికోతల సమయంలో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు డీజిల్ దొరకక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కొందరు డీలర్లు డీజిల్ను లీటరుకు రూ.300 వరకు బ్లాక్లో విక్రయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.