AP: రాష్ట్రవ్యాప్తంగా 600 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు పరికరాలు, కంటెంట్ సహా అవసరమైన ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ఒక్కో హాస్టల్కు రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.15 కోట్లు అవసరమవుతాయని అధికారులు నివేదించగా.. ఈ నిధుల సమీకరణ బాధ్యతను తామే తీసుకుంటామని కమిటీ తెలిపింది.