రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట షాకింగ్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి అయినప్పటికీ ఇంకా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి హామీలపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై పల్లెల్లో అసంతృప్తి మొదలైంది’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.