జనాభా లెక్కలు పూర్తి అయ్యాక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపడతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో ఒకప్పుడు బాంచన్ దొర అనే సంస్కృతి ఉండేదని, పున్నయ్య కమిషన్ తీసుకొచ్చి కుల వివక్ష నిర్మూలనకు కృషి చేసినట్లు తెలిపారు. అలాగే అంటరానితనం రూపుమాపడానికి తన పాలనలో ఎన్నో జీవోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.