AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు బార్లపూడి క్రాంతి చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వైఎస్ జగన్ ట్రాప్లో పడొద్దంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ను ప్రశ్నించే అర్హత జగన్కు ఉందా? అంటూ క్రాంతి ట్విటర్లో నిలదీశారు. గత పరిణామాలను గుర్తు చేస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ, జనసేన శ్రేణుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ట్వీట్ రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది.