AP: శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. దీంతో భక్తులు, ఆలయ సిబ్బంది టీటీడి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టి.. ఓ భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన భక్తుడు దాదాపుగా 10 నిమిషాలు డ్రోన్ కెమెరా వినియోగించినట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.