కొవ్వూరు నుంచి విజయవాడకు ఆహారం పంపిణీ

విజయవాడ వరద బాధితుల సహాయర్ధం దాతలు ముందుకు రావడం అభినందనీయమని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం నియోజకవర్గం నుంచి రెవెన్యూ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, త్రివేణి గ్లాస్ ఇండస్ట్రీస్ -2, బొల్లిన శివనాగేంద్ర సహకారంతో తయారు చేసిన 9000 ఆహార పొట్లాలు, 20, 000 వాటర్ బాటిల్స్, 10, 000 వాటర్ ప్యాకెట్స్ సిద్ధం చేయించిన వాహనాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించి ఆయన వెళ్లారు.

సంబంధిత పోస్ట్