జిల్లాలో 4,30,339 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల లోపు 4, 30, 339 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మాత్రలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్