గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు జన్మదినం సందర్భంగా బుధవారం గోల్లగూడెంలోని భారతి దివ్యాంగుల ఆశ్రమంలో అన్నదానం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ, సమాజ సేవే తన లక్ష్యమని, సేవా కార్యక్రమాల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.