అమలాపురం: తెలుగు మహాసభల్లో బుర్రకథా వైభవం

అమలాపురంలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాగం జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఆదివారం 'తెలుగు భాషా ప్రస్థానం' అనే బుర్రకథను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. పుణ్యమంతుల అర్జునరావు రచనలో, చిక్కం నాగబాబు శిక్షణలో కె. కరుణ భార్గవి బృందం ఈ ప్రదర్శన ఇచ్చింది. కనుమరుగవుతున్న బుర్రకథను విశ్వవేదికపై చాటిచెప్పిన విద్యార్థినులను, ఉపాధ్యాయులను కిమ్స్ అధినేత చైతన్య రాజు అభినందించారు.

సంబంధిత పోస్ట్