అమలాపురంలో శుక్రవారం ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు నడుస్తుండగా, దాని అత్యవసర ద్వారం ఊడి కింద పడిపోయింది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజే ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.