అమలాపురం పరిధిలోని వేమవరప్పాడులో ఆదివారం కొబ్బరి చెట్టుపై కాయలు దింపుతుండగా, విద్యుత్ తీగలు తగిలి మానుపాటి గోవిందు అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ షాక్ తీవ్రతకు ఆయన చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. గోవిందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.