పేరూరు: చెరువులో బాలుడి మృతదేహం లభ్యం

అమలాపురం రూరల్ మండలం పేరూరు మంచినీటి చెరువులో ఆదివారం గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు జారిపడిన నందుల మోక్ష (9) అనే బాలుడి మృతదేహం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్