అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం రంగంపేట మండలం దొడ్డిగుంటలో జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలు అక్రమాలతో నిండిపోయాయని ఆరోపించారు. ఓటమి భయంతో ఎన్నికలు వాయిదా వేయించి, పోలీసుల సహకారంతో ఏకపక్షంగా నిర్వహించారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకులపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టి, అర్హులైన ఓటర్లను అడ్డుకుని అనర్హులను అనుమతించడం ప్రజాస్వామ్యానికి అవమానమని ఆయన అన్నారు.