అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దంత వ్యాధులకు సంబంధించిన ఎక్సరే, ఇంట్రా ఓరల్ కెమెరా వంటి ఆధునిక వైద్య పరికరాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. పేదలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.