అనపర్తి మండలం కొప్పవరం గ్రామాల్లో కొలువైయున్న శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 31వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకలు జరుగుతాయి. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపడతామని వారు వెల్లడించారు.