పి. గన్నవరంలో "పవనన్న ఆరోగ్య భరోసా కేంద్రం" ప్రారంభం

పి. గన్నవరం మండలం ఊడిమూడిలో మంగళవారం పవనన్న ఆరోగ్య భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ఉచిత పరీక్షలు, సొంత ఖర్చుతో శస్త్రచికిత్సలు, కంటి అద్దాల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్