దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన సుంకర వీర్రాజు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దేవరపల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.