ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం పురంలో జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్, వైసీపీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఆకుల వీర్రాజు, పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారందరికీ ప్రత్యేక రాష్ట్రం కలగాలన్న తపనతో పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహారదీక్ష ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన త్యాగం ప్రతి ఆంధ్రుడికి స్ఫూర్తిదాయకమని వీర్రాజు అన్నారు.