దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో చికెన్ ధరలు తగ్గకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కార్తీకమాసంలో చికెన్ ధరలు తగ్గుతాయని భావించినా, ఈ ఏడాది కేజీ బాయిలర్ రూ.240, కేజీ పారం కోడి మాంసం రూ.220 చొప్పున ధరలు అధికంగానే ఉన్నాయి. వ్యాపారస్తుల ప్రకారం, ప్రాంతాన్ని బట్టి ధరలలో స్వల్ప మార్పులున్నాయి.