దుద్దుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఐసర్ వ్యాన్, ఒకరి మృతి

దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాజమండ్రి వైపు వెళుతున్న ఐసర్ వ్యాన్ వెనుక నుండి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బంధపురం గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ (50) రోడ్డు డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్