గోపాలపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎంపీడీవో జీ. రాజమనోహర్ మంగళవారం తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.