నల్లజర్లలో మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరతకు నిరసనగా ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇంధన కొరత నివారించడంలో విఫలమైందని, డీజిల్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఆమె విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు.